Revanth reddy: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని , ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేయడంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన టార్గెట్ చేస్తుంటారు. తాజాగా మరోమారు అదే రీతిలో స్పందించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 ఏళ్లుగా హైద్రాబాద్లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు.
Read More : KCR: కేసీఆర్కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు
రేవంత్ సంచలన విమర్శలు…
ఎల్బీ నగర్ పరిధిలో మ్యాన్ హోల్లోకి దిగి చనిపోయిన కార్మికుల ఇళ్లకు వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లి.. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది వరదలకు హైద్రాబాద్ మునిగింది. వరద బాధితులకు రూ. 10,000 ఇస్తా అని రూ. 600 కోట్లు విడుదల చేశారు. అందులో టీఆర్ఎస్ నాయకులు రూ. 300 కోట్లు దోచుకున్నారు. దళితబంధు తెచ్చామని గొప్పలు చెబుతున్నారు కదా.. మరి దళిత కార్మికులు చనిపోతే.. వారి కుటుంబాలను ఎందుకు పట్టించుకోవడం లేదు“ అని ప్రశ్నించారు.
Read More: Revanth Reddy: రాహుల్తో కలిసి తన రేంజ్ ఏంటో చూపించనున్న రేవంత్
చట్టం పేరు చెప్పి..
నేషనల్ సఫాయి కర్మచారి యాక్ట్ ప్రకారం.. మాన్యువల్గా స్కేవెంజింగ్ చేయకూడదని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. “మ్యాన్ హోల్లోకి మనుషులను దింపకూడదు. అయినా ఇద్దరు కార్మికులను దింపి.. వారి చావుకు కారణమయ్యారు. వారిలో అంతయ్య మృతదేహం ఇంకా దొరకలేదు. ఆ రెండు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశాం. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో పాటు కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. నేను ఇప్పటికే.. జోనల్ కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడాను. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించడం లేదు. పార్లమెంట్ సభ్యుడినైన నేను రెండు గంటల నుంచి కాల్ చేస్తుంటే.. ఆయిన కాల్స్ కట్ చేస్తున్నాడు.మరి అలా చేసినందుకు ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్పై క్రిమినల్ కేసులు పెట్టాలని జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తా. ఇంత పెద్ద ఘటన జరిగినా నగర మేయర్ విజయ లక్ష్మి స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా.. ఘటన జరిగిన చోటును పరిశీలించి.. బాధిత కుటుంబాలకు భరోసాగా నిలబడాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీని ఇరకాటంలో పడేశారని అంటున్నారు.