Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కి చాన్స్ ఖరారైన సయమంలో ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగత తెలిసిందే. ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేల కేంద్రంగా విమర్శలు పెద్ద ఎత్తున్నే వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో రేవంత్ ఒక మాట అంటే కేసీఆర్ టీం పది మాటలు అంటోంది. ఇదే ఒరవడిలో తాజాగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు.
Read More: Revanth Reddy: రేవంత్ పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నది ఎవరో తెలుసా?
కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే….
కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం దారుణమని పేర్కొన్న కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వారందరికీ ప్రజల చేత భారీ గుణపాఠం ఎదురుకానుందని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే తమ కార్యాచరణ ఉంటుందన్నారు. అయితే, దీనిపై టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తనపై ప్రయోగించిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. తనకు కాంగ్రెస్ లో పదవులు రావడానికి అక్కడ తాను అంకిత భావం తో పని చేయడమే కారణమని ఆయన పేర్కొన్నారు. 36 ఏళ్లు కాంగ్రెస్ లో పనిచేశానని పేర్కొన్న సుధీర్ రెడ్డి కార్పొరేటర్ అయ్యా 22 ఏళ్లకు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని తెలిపారు.
Read More: KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
యాష్కీపై సంచలన విమర్శలు..
మధు యాష్కీ అమెరికా నుంచి 2003 లో రాగానే కాంగ్రెస్ లో తక్కువ సమయానికే టికెట్ వచ్చిందని సుధీర్ రెడ్డి ఆరోపించారు. “మధు యాష్కీ అమెరికా లో ఎన్ని నేరాలు చేశారో నా దగ్గర చిట్టా ఉంది ..సమయం వచ్చినపుడు చెబుతా. దొంగ సర్టిఫికెట్లతో అమెరికాకు జనాలను పంపే ముఠా ను నడిపింది యాష్కీ కాదా ? అమెరికాలో అటార్నీ పరీక్షలు ఆరు సార్లు రాసి ఫెయిలయ్యారు ..కానీ అటార్నీ అని చెప్పుకుంటారు. .మధు యాష్కీ దొంగ చదువు సర్టిఫికెట్ గురించి తెలిసిందే “ అంటూ సుధీర్ రెడ్డి విరుచుకుపడ్డారు.