టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మావారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని తనకు కే చంద్రశేఖరరావుతో ఎలాంటి లాలూచీ లేదని ప్రమాణం చేశారు. చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు కేసిఆర్ తో కొట్లాడతాననీ, రాజీ నా రక్తం లేదని అన్నారు. భయం నా ఒంట్లో లేదు..అమ్మావరి కండువా కట్టుకొని ప్రమాణం చేస్తున్నా.. నేను కేసిఆర్ తో కొట్లాడుతున్నప్పుడు నువ్వు (ఈటెల) కేసిఆర్ పక్కన నిలబడి ఉన్నావ్. కేసిఆర్ పక్కన సాక్షిగా నువ్వే కదా ఉన్నది. అమ్ముడుపోయే వాడిని అయితే .. నీ లెక్క మంత్రిని అయ్యే వాడిని అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు.
రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికార బీఆర్ఎస్ పార్టీ రూ.25 కోట్లు ఇచ్చిందని, అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, రేపు ఎన్నికల తర్వాతైనా ఒక్కటవుతాయని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈటల .. అది నిరూపించగలవా అని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి ఆలయంలో తమకు ఎలాంటి నిధులు బీఆర్ఎస్ నుండి అందలేదని ప్రమాణం చేస్తానని, అందుకు ఈటల రాజేందర్ సిద్దమా అని ప్రశ్నించారు. అయితే తన వద్ద అందుకు ఆధారాలు లేకపోవచ్చని, రూ.25 కోట్లు కేసిఆర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఈటల మళ్లీ స్పందించారు. దీంతో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ మాత్రం ఆలయం వద్దకు రాలేదు.
PSLV-c55: పీఎస్ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?