Revanth reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన సర్కారుపై ఓ రేంజ్లో విరుచుకుపడే సంగతి తెలిసిందే. అయితే, అనుకోకుండా జరిగిందా లేదా కావాలనే చేశారా తెలియదు కానీ రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయం సాక్షిగా రేవంత్రెడ్డికి అవమానం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగానే స్పందించనున్నట్లు తెలుస్తోంది.
Read More : Revanth reddy: సెంటిమెంట్తో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
ఏం జరిగిందంటే…
ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై.. రూ. 1.20 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు శిలాఫలకంపై ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు శిలాఫలకాలపై స్థానిక ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరించారు. ఆయన స్థానంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేరును లిఖించారు.
Read More : KCR: కేసీఆర్ షాకింగ్ నిర్ణయాలు… మరో అధికారి బదిలీలో కూడా అదే లెక్క
రంగంలోకి కాంగ్రెస్ శ్రేణులు
మేడ్చల్-మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డికి బదులు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేరును శిలాఫలకంపై ఏర్పాటు చేయడం చర్చనీయంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే రేవంత్రెడ్డి పేరును తొలగించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా కావాలనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు రేంత్రెడ్డి పేరు లేకుండా కుట్ర చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?