Revanth Reddy: పీసీసీ అధ్యక్ష పీఠం కోసం సీరియస్గా ప్రయత్నించిన వారిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ పదవి పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డిని వరించింది. అయితే, ఎంపీ కోమటిరెడ్డి తన సంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు. తాజాగా మరోమారు అదే రీతిలో కామెంట్లు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు దక్కకపోవడంపై కోమటిరెడ్డి స్పందించారు. సీనియర్ నాయకుడిగా అన్ని అర్హతలు ఉన్నా ఆశించిన పదవి దక్కకపోతే బాధగా ఉంటుందని వెంకట్రెడ్డి అన్నారు.
Read More: Revanth Reddy: రేవంత్ పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నది ఎవరో తెలుసా?
నేను పార్టీ మారుతానా?
పీసీసీ పదవి దక్కనంత మాత్రనా తాను పార్టీ మారతానని అనుకోవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా పార్టీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని, అయినా వెళ్లలేదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, గతంలో మంత్రి పదవిని తాను వదులుకున్నానని కోమటిరెడ్డి గుర్తు చేశారు. పార్టీలు మారాల్సిన, గ్రూపులు కట్టాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మోసాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సిన అవసరం కూడా లేదని.. తనకు తెలిసిందల్లా కార్యకర్తలకు అండగా ఉండటమేనన్నారు.
Read More: Revanth Reddy: కేసీఆర్ నీటి ఎత్తుగడకు అప్పుడే కౌంటర్ రెడీ చేసిన రేవంత్
రేవంత్ను మామూలుగా కెలకడం లేదుగా..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. ‘రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో, నేను భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించలేక పోయాం. గాంధీ భవన్లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్ లేకుండా పని చేసినప్పుడే గెలుస్తాం. నూతన బాధ్యతలు స్వీకరించిన వాళ్లు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలతో మమేకం కావాలి’ అని కోమటిరెడ్డి సూచించారు.