Sai Dharam Tej: రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, మెగా బ్రదర్స్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు అయిన నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సాయి తేజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ రోజు జరుపుకుంటున్న విజయదశమికి మరో ప్రత్యేకత ఉందన్న మెగాస్టార్ చిరంజీవి.. రోడ్డు ప్రమాదంలో ప్రాణపాయ స్థితి నుండి తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కొలుకుని ఇంటికి వస్తున్నారనీ, ఇది అందరికీ సంతోషపెట్టే విషయమన్నారు. ఇది సాయి తేజ్ కు మరో జన్మలాంటిదేనని తెలిపారు. తేజుకి అత్త, పెద్దమామ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చిరు ట్వీట్ చేశారు.
Read More: AP Govt: సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన జగన్ సర్కార్..!!
Sai Dharam Tej: ఆసుపత్రిలో 35 రోజుల చికిత్స అనంతరం ఇంటికి
గత నెల 10న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. తేజ్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ జరిగింది. దీంతో కొద్ది రోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ నేటి ఉదయం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 35 రోజుల పాటు సాయి తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరారు.
Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!
సాయితేజ్ కి సెలబ్రిటీల శుభాకాంక్షలు
సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి తేజ్ కు విజయ దశమితో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయి తేజ్ 35వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్, గోపి చంద్ మలినేని, దేవ కట్ట , అల్లు శిరీష్, హరీష్ శంకర్, రవి తేజ, బండ్ల గణేశ్, అనిల్ రావిపూడి తదితర సినీ ప్రముఖులు సాయి తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సాయి తేజ్ కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.