కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపు పై తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో రిలీఫ్ లభించింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. కాళేశ్వరం మూడో టీఎంసీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాసరెడ్డి సహా కొందరు పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవి నాగరత్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ సర్కార్ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారంటూ వాదనలు వినిపిస్తూ తుది తీర్పు వచ్చే లోగా అనుమతులపై గోదావరి బోర్డు, సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని కోరారు. తుది తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం ఉంటుందని కూడా స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం..మూడో టీఎంసి కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీలు పరిశీలించవచ్చని తెలిపింది. తుది ఉత్తర్వుల మేరకు అనుమతులు లోబడి ఉంటాయని కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది. పరిహారం తీసుకోని భూములు ఇవ్వదలుచుకున్న రైతులకు కూడా అనుమతి ఇచ్చింది. తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డన్ లో సవరణలు చేసింది సుప్రీం కోర్టు. దీంతో తెలంగాణ సర్కార్ కు రిలీఫ్ లభించినట్లు అయ్యింది.
తెరపైకి మేకపాటి శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి .. ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబంలో కొనసాగుతున్న వివాదం