29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తాము 24వ తేదీన పిటిషన్ ను విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హజరు కావాలని ఈడీ మరో సారి నోటీసులు జారీ చేయడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలవడంపై కవిత అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేశారు.

MLC Kavita

 

కవిత ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు హజరు కావాల్సి ఉండగా హజరుకాలేదు. అయితే ఈడీ మాత్రం 20న విచారణకు హజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన పిటిషన్ ను త్వరితగతిన విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. దీంతో కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. కవిత విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఏమి చేయాలనే దానిపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక పర్యాయం కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.

మరో పక్క ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

Breaking: కడప ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ .. అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు


Share

Related posts

Khiladi : దుబాయ్‌లో ఖిలాడి

GRK

వైరల్ అయిన తన వ్యాఖ్యలపై స్పందించిన మేకతోటి సుచరిత.. వివరణ ఇలా

somaraju sharma

Ambati Rambabu: టంగ్ స్లిప్ అయ్యింది..! జాతికి క్షమాపణ కోరిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి..!!

Srinivas Manem