YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా రాజకీయ అరంగ్రేటం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేసిన నాటి నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు ఆమెను కలిసి మద్దతు తెలియజేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ సన్నిహితంగా ఉన్న నేతలు, ఉన్నతాధికారులు షర్మిలను కలిసి మద్దతు తెలియజేస్తున్నారు.
శుక్రవారం ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బహిరంగ సభ వేదికగా షర్మిల పార్టీ పేరు, జెండా, ఏజండా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఖమ్మం బహిరంగ సభకు పోలీసు యంత్రాంగం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఖమ్మం బహిరంగ సభకు ముఖ్య అతిధిగా వైఎస్ విజయమ్మ హజరు అవుతారని సమాచారం.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల విషయంలో కేసిఆర్ సర్కర్ కీలక నిర్ణయం తీసుకున్నది. షర్మిలకు ప్రభుత్వ భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆమెకు కేటాయించింది.
.