సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీకి గతంలోనే రాజీనామా చేశారని ఆయన భార్య విజయలక్ష్మి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపిస్తూ.. రాజకీయాల కోసం డీఎస్ ను వాడుకోవద్దని కోరారు. ఇప్పటికే తన భర్త డీఎస్ కు ఒక సారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని పేర్కొన్న విజయలక్ష్మి.. కాంగ్రెస్ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నా, కాంగ్రెస్ వారు ఇటువైపు రావొద్దు, డీఎస్ ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ వేడుకున్నారు. డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు.
రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!
తాజాగా ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా డీఎస్ గాంధీ భవన్ కు వెళ్లగా పార్టీ నేతలు డీఎస్ కు కూడా పార్టీ కండువా కప్పారు. దీంతో కుమారుడుతో పాటు డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై డీ ఎస్ కూడా కాంగ్రెస్ లో చేరినట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసారు. ఒక వేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా భావిస్తే మళ్లీ రాజీనామా చేస్తానని డీఎస్ పేర్కొన్నారు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు డీఎస్ చెప్పారు.
Breaking: వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు..దర్యాప్తునకు మరో అధికారిని నియమించాలంటూ..