తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల (డిసెంబర్) 31వ తేదీ పదవీ విరమణ కానుండటంతో పలు బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ నియమితులైయ్యారు. ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, హోంశాఖ కార్యదర్శిగా జితేందర్ నియమితులైయ్యారు.