TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మెమో ద్వారా మరో నలుగురు నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. అయితే ఏసీబీ కేసును సిట్ విచారించే అర్హత లేదంటూ సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీనిపై సిట్ ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభాారతి, నందకుమార్, సింహయాజీలను విచారణ జరిపిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురుకి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందుకున్న వారిలో పలువురు కోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసులపై ఈ నెల 13వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.
ఈ కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన నాయకుడు తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాదులను ఏ 4, ఏ5, ఏ 6, ఏ 7గా నిందితుల జాబితాలో చేర్చి పోలీసులు ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. పోలీసుల మెమోను తప్పుబడుతూ 7వ నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మెమో జారీ చేసే విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు శ్రీనివాస్ ను నిందితుడుగా చేర్చడాన్ని తప్పుబట్టింది. ఆయనకు రిలీఫ్ ఇస్తూనే పోలీసులు మెమోను కొట్టివేసింది. దీంతో శ్రీనివాస్ తో పాటు మిగిలిన నిందితులు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి పేర్లను ఎఫ్ఐఆర్ నుండి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం