మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో కాలి బుడిద అయ్యారు. ఈ ఘటన మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. విఆర్ఏ శివయ్య నివాసం నుండి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటంతో ఫైర్ సిబ్బంది అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశారు. అయినప్పటకీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఇంట్లోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో విఆర్ఏ గా పని చేస్తున్న శివయ్య (50) , ఆయన భార్య పద్మ (45), పద్మ అక్క కుమార్తె మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమ బిందు, స్వీటి, మరో వ్యక్తి శాంతయ్యలు మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర దుర్గటనతో గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?