Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకంటే ముందే సంచలనాలు సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఈ హాట్ చర్చకు కారణం. అయితే, ఈ పథకం అమలు విషయంలో ఓ ట్విస్టు చోటు చేసుకుంది. ఈ పథకం క్రెడిట్ విషయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు.
Read More: KCR: దళితుల కోసం ఇంకో సంచలన హామీ ఇచ్చిన కేసీఆర్
ఏం జరిగిందంటే…
దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఈటల రాజేందరే అని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నగురం, తనుగుల SC కాలనీలో బీజేపీ నేత ఈటల రాజేందర్ కి దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఏనాడు దళితులను పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇవాళ దళితుల గురించి మాట్లాడుతున్నాడంటే అందుకు ఈటల రాజేందర్ అన్నారు. దళితులంతా ఈటలవైపే ఉన్నారనే…. భయంతో కేసీఆర్ దళిత స్కీం తెచ్చారని చెప్పారు. తనుగుల ఎంపీటీసీ భర్తతో దళిత బంధు గురించి సీఎం ఫోన్ లైన్ లో మాట్లాడారు. అయితే.. అదే ఊరికి చెందిన దళితులు.. ఈటలకు పాలాభిషేకం చేయడం గమనార్హం.
Read More : KCR: మోత్కుపల్లికి కేసీఆర్ కండువా కప్పేది అందుకేనా?
కేసీఆర్ మరో సంచలనం…
ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.