T Congress: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం (నేడు) చలో రాజ్ భవన్ పేరుతో ముట్టడి కార్యక్రమానికి టీపీసీసీ పిలుపునిచ్చింది. సోమాజిగూడ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం పది గంటలకల్లా పార్టీ శ్రేణులు సోమాజిగూడ పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామునే రాజ్ భవన్ ను ముట్టడించారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు ఊహించని విధంగా ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఎన్ ఎస్ యూ ఐ నేతలు రాజ్ భవన్ వద్దకు చేరుకుని భైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు.