Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న గత రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి పోలీసులు మల్లన్న ఆఫీసులో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై మల్లన్న ఘాటుగా స్పందించారు. తీన్మార్ మల్లన్న టీం 7200 వరంగల్ ఉమ్మడి జిల్లా సభ్యుల సమావేశంలో మాట్లాడిన మల్లన్న సంచలన కామెంట్లు చేశారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఏం చేయలేరని ఆయన పేర్కొన్నారు.
Read More: Revanth reddy: రేవంత్ రెడ్డి ని ఘోరంగా అవమానించిన కేసీఆర్ సర్కారు
మల్లన్న సంచలన కామెంట్లు…
కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మల్లన్న అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల తర్వాత జైలుకెళ్లడం తప్పదని తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్లు చేశారు. కేసీఆర్కు రాజకీయ సమాధి కడతానని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి తన చానెల్పై దాడి జరగబోతోందన్న విషయం కూడా తనకు ముందే తెలుసని వ్యాఖ్యనించారు. నా కదలికలు కనిపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నరు గాని, కేసీఆర్ తీసుకునే ప్రతి చర్య, ప్రతి కదలిక తనకు ముందే తెలుస్తోందని అన్నారు. సోమవారం రాత్రి దాదాపు 50మంది పోలీసులు తన ఆఫీసులో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్క్లతో పాటు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకెళ్లారని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల డేటా తన వద్ద ఉందనే సమాచారంతోనే కేసీఆర్ ఈ దాడులు చేయించడాని ఆరోపించారు. అసలు సమాచారం ఉన్న హర్డ్ డిస్క్లు ఇంకా భద్రంగానే ఉన్నాయంటూ తన శైలిలో కామెంట్ చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా తీన్మార్ మల్లన్న 7200టీం సభ్యులు ప్రజాక్షేత్రంలో పనిచేయబోతున్నారని అన్నారు. ఆగస్టు 29 నుంచి ఆట మొదలు కాబోతోందని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.
Read More: KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు…
విద్య, వైద్యమే మా ఎజెండా…
అందరికీ మెరుగైన విద్య, వైద్యం ఉచితంగా అందించడం కోసమే తీన్మార్ మల్లన్న టీం కొట్లాడబోతోందని అన్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను చాటిచెప్పబోతోందని అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని నేర్పించబోతున్నాం. ఇంటికో తీన్మార్ మల్లన్నను తయారు చేయబోతున్నామంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. రాజకీయ పార్టీలపై కాకుండా ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న టీం పోరాటం చేయబోతోందని, అది కూడా శాంతియుతంగా, కొట్లాటలు లేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుల రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.