ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బల్క్ డ్రగ్ పార్క్ ల కోసం వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ధరఖాస్తులు చేయగా ఏపి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదం తెలిపింది. దీనిపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పందిస్తూ ప్రధాని మోడీ పై ఫైర్ అయ్యారు. దేశంలోనే ఫార్మా హబ్ గా తెలంగాణ ఉందనీ, అలాంటి తెలంగాణను కాదని కేవలం మూడు రాష్ట్రాలకే కేంద్రం బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించిందని కేటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ పై మోడీ వివక్షతను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన ఆరోపించారు.
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ.. ఈ నౌక ప్రత్యేకతలు ఏమిటంటే..?
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ను కేంద్రం కావాలనే విస్మరిస్తొందని కేటిఆర్ విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు తాము కొన్ని సంవత్సరాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. 2వేల ఎకరాల్లో బల్క్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపామని చెప్పారు. ఫార్మా సిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా కేంద్రానికి అందజేశామని వివరించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి కేంద్ర మంత్రులను కలిసి బల్క్ డ్రగ్ పరిశ్రమకు అవకాశం ఇవ్వాలని కోరామని చెప్పారు. అన్ని సౌకర్యాలతో సిద్దంగా ఉన్న తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడం తమకు షాక్ కు గురి చేసిందని మంత్రి కేటిఆర్ అన్నారు.
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?