Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఆధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల దాడి జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరో సారి టీఆర్ఎప్ నేతల పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసును ప్రస్తావించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన అయిదుగురు అధికార టీాఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. క్లోజ్ అయిన ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తామని ఆయన అన్నారు.
బెంగళూరులో డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్రను పోలీసులు వెలికి తీయడంతో వారు అక్కడ పోలీస్ లను మేనేజ్ చేసి కేసును కొట్టివేయించుకున్నారని తెలిపారు. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా టీఆర్ఎస్ నేతలు పోలీసులను మేనేజ్ చేసి తప్పించుకున్నారనీ, క్లోజ్ అయిన ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.