తెలంగాణ సీఐడీ డీజీ గోవింగ్ సింగ్ సమీమణి షీలా సింగ్ రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గోవింద్ సింగ్ తో పాటు ఆయన కారు డ్రైవర్ కూడా గాయపడ్డారు. రాజస్థాన్ లోని ప్రఖ్యాత మాతేశ్వరి తనోదరాయ్ మాత ఆలయాన్ని సందర్శించే నిమిత్తం గోవింద్ సింగ్ సతీమణి షీలా సింగ్ తో కలిసి వెళ్లారు. మతేశ్వరిని దర్శంచుకున్న తర్వాత సతీసమేతంగా ఆయన తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు.
తెలంగాణకు తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు రామ్ గఢ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఘంటియాలి మాత ఆలయం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడకు చేరుకుని గాయపడిన గోవింద్ సింగ్, ఆయన కారు డ్రైవర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, స్వల్పగాయాలే ఆయినట్లు వైద్యులు తెలిపారు.