భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రోజు సాయంత్రం సతీసమేతంగా ఢిల్లీ పయనం అవుతున్నారు. ఈ నెల 14న ఢిల్లీలోని పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసిఆర్ ఏ ముఖ్య కార్యక్రమాన్ని చేపట్టినా ముందుగా ప్రత్యేక పూజలు, యాగాలు చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 13, 14 తేదీల్లో పార్టీ కార్యాలయంలో రాజశ్యామల యాగం చేయనున్నారని చెబుతున్నారు. రెండు రోజుల పాటు కేసిఆర్ దంపతులు యాగంలో పాల్గొననున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మరో ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ
ఢిల్లీలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ పలు సూచనలు చేశారు. యాగశాల నిర్మాణం, కార్యాలయంలో చేపట్టాల్సిన మరమ్మత్తులు, ఇతరత్రా పనులపై ప్రముఖ వాస్తు సిద్ధాంతి సుద్దాల సుధాకర్ తేజతో చర్చించారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్న కేసిఆర్ నాలుగు రోజుల పాటు అక్కడ ఉండనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పక్క కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 14న జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హస్తినకు బయలుదేరుతున్నారు. విమానాల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలువురు నేతలు ఈ రోజే సాయంత్రానికే ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్