Etela Rajender: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసిఆర్ ఆదేశించారు. నిజా నిజాలు తేల్చాలని డీజీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రాధమిక నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. నేటి ఉదయం నుండి మీడియాలో ఈటెల రాజేందర్ భూకబ్జా బాగోతం అంటూ ప్రముఖంగా రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మంత్రివర్గం నుండి కేసిఆర్ తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్ది సేపటిలో మంత్రి ఈటెల స్వయంగా రాజీనామా సమర్పిస్తారని కూడా అంటున్నారు.