తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప అనారోగ్యానికి గురైయ్యారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఇబ్బందిపడ్డ కెసిఆర్కు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ వైద్య పరీక్షలు నిర్వహించారు.కేసిఆర్ను పరీక్షించిన వైద్యులు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు అవసరం అని సూచించారు. దీంతో ఈ పరీక్షల నిర్వహణకు కెసిఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్ళారు. యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు అయా వైద్య పరీక్షలు నిర్వహించారు. కెసిఆర్ వెంట కుమారుడు, మంత్రి కెటిఆర్, కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఎంపి సంతోష్ కుమార్ ఉన్నారు.
ఈ స్వల్ప అనారోగ్యం కంటే ముందు కేసిఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన హీమా కోహ్లీ పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా సీజేగా నియమితులైయ్యారు. ఈ కార్యక్రమానికి హజరైన సీఎం కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాన న్యాయమూర్తి కోహ్లిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత స్వల్ప అస్వస్తత అనిపించగా వైద్యులతో పరీక్షలు చేయించుకున్నారు.