తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ పార్టీ స్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ దశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసిఆర్ కు స్వతహాగా దైవ భక్తి ఎక్కువ. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఆయన దైవ దర్శనం చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇవేళ సీఎం కేసిఆర్ సతీసమేతంగా యాదాద్రి పర్యటనకు వెళుతున్నట్లు సమాాచారం. ఉదయం పదిన్నర గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు వెళతారు సీఎం కేసిఆర్. 11.30 గంటలకు ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులు శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఆలయ విమాన గోపురం తాపడం కోసం కేసిఆర్ దంపతులు బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.
కేసిఆర్ గతంలోని విమాన గోపురం తాపుడానికి కోలో 16 తులాల బంగారం ఇస్తానని ప్రకటించడంతో ఇవేళ ఆ మొక్కును తీర్చుకోనున్నారు. జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో కేసిఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కేసిఆర్ భావిస్తున్నారు. అంతే కాకుండా యాదాద్రిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపైనా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం కేసిఆర్ పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన ప్రకటన .. గిరిజనులకు గుడ్ న్యూస్