నేషనల్ హరాల్డ్ కేసులో పలువురు టీ కాంగ్రెస్ నేతలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ ఇటీవల తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. పార్టీకి, అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తొంది. నోటీసులు అందుకున్న వారు అక్టోబర్ 12వ తేేదీ విచారణకు హజరుకావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి నోటీసులు అందుకున్న వారికి పిలుపు వచ్చింది. పలువురు నేతలు గురువారమే హస్తినకు చేరుకోగా, ఈ రోజు మరి కొందరు వెళ్లారు. కేసుకు సంబంధించి వివరాల గురించి అధిష్టానం వారికి వివరించనుంది. నోటీసులు అందుకున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ ఆలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, తదితరులు ఉన్నారు. ఈ రోజు ఆడిటర్లతో వీరు సమావేశమై ఈడీ విచారణలో ఎదుర్కొనే అంశాలపై చర్చించనున్నారు.
ఈడీ కార్యాలయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణను ఎదుర్కొన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
Breaking: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇండోస్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసిన ఈడీ