Telangana Congress: సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న డీ శ్రీనివాస్ పదవీ కాలం మరో అయిదు నెలలు ఉంది. చాలా కాలంగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడుగా టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసిఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ డీఎస్ ను దూరం పెట్టింది. పార్టీ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించడం లేదు. దీంతో ఆయన పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
Telangana Congress: డీఎస్ ను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన తరువాత డీ శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లోనే డీఎస్ రెండవ కుమారుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. డీ శ్రీనివాస్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తరువాత డీ శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి కూడా వచ్చారు. హూజారాబాద్ ఉప ఎన్నికలకు ముందే డి శ్రీనివాస్ చేరిక ఉంటుందని భావించారు. పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన డీ శ్రీనివాస్ మరల కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని టీపీసీసీలోని కొందరు నాయకులు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. కష్టకాలంలో పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఏమిటని డీఎస్ వ్యతిరేకులు కొందరు అన్నట్లు వార్తలు వినబడ్డాయి.
సోనియా గాంధీ ఆమోదం తెలియజేయడంతో
డీ శ్రీనివాస్ చేరికపై సోనియా గాంధీ ఆమోదం తెలియజేయడంతో పలువురి టీపీసీసీ నేతల అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. ఈ నెల 24వ తేదీన డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ లోపుగానే టీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా జోష్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఇతర పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను ఆయన తిరిగి ఆహ్వానిస్తున్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాతనే పార్టీలో చేరికలు పునః ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత అనేక మంత్రి కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు అధికార టీఎస్ఆర్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనున్న పలువురు నేతలు బీజేపీలో చేరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?