NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: కాంగ్రెస్ లో డీఎస్ చేరికకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?

Telangana Congress: సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న డీ శ్రీనివాస్ పదవీ కాలం మరో అయిదు నెలలు ఉంది. చాలా కాలంగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడుగా టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసిఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ డీఎస్ ను దూరం పెట్టింది. పార్టీ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించడం లేదు. దీంతో ఆయన పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

Telangana Congress mp D srinivas
Telangana Congress mp D srinivas

 

Telangana Congress: డీఎస్ ను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన తరువాత డీ శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లోనే డీఎస్ రెండవ కుమారుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. డీ శ్రీనివాస్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తరువాత డీ శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి కూడా వచ్చారు. హూజారాబాద్ ఉప ఎన్నికలకు ముందే డి శ్రీనివాస్ చేరిక ఉంటుందని భావించారు. పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన డీ శ్రీనివాస్ మరల కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని టీపీసీసీలోని కొందరు నాయకులు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. కష్టకాలంలో పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఏమిటని డీఎస్ వ్యతిరేకులు కొందరు అన్నట్లు వార్తలు వినబడ్డాయి.

సోనియా గాంధీ ఆమోదం తెలియజేయడంతో

డీ శ్రీనివాస్ చేరికపై సోనియా గాంధీ ఆమోదం తెలియజేయడంతో పలువురి టీపీసీసీ నేతల అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. ఈ నెల 24వ తేదీన డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ లోపుగానే టీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా జోష్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఇతర పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను ఆయన తిరిగి ఆహ్వానిస్తున్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాతనే పార్టీలో చేరికలు పునః ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత అనేక మంత్రి కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు అధికార టీఎస్ఆర్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనున్న పలువురు నేతలు బీజేపీలో చేరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?