Governor Tamilisai: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ పై పరోక్షంగా గవర్నర్ తమిళి సై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలూ చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించిన మహిళా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల నేతలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రజాదర్బార్ కు హజరైయ్యారు. కొందరు మహిళలు ఇటీవల జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో గవర్నర్ తమిళి సై ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ గ్యాంగ్ రేప్ ఘటనపై తనకు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం సీఎస్, డీజీపీలను గవర్నర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక అందకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని ఆరోపించారు తమిళి సై. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Governor Tamilisai: నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు
తెలంగాణ ప్రజల కోసం తాను పని చేస్తున్నాననీ, ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాననీ, తనను ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు గవర్నర్ తమిళిసై. వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే తన గుండె రగిలిపోతుందన్నారు. మహిళలను ఆదుకోవడానికి తాను ఎప్పుడూ బలంగా ఉంటానన్నారు. మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. రాజ్ భవన్ కు వచ్చే వినతులు అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. మహిళా దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదనీ, భవిష్యత్తులోనూ మహిళా దర్బార్ కొనసాగుతుందని చెప్పారు. మహిళల గెలుపును ఎవరూ ఆపలేరని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు.