Hyderabad Gang Rape: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్ తమిళి సై ఆదేశించారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని గవర్నర్ తమిళి సై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు దీనిపై ఆందోళన చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ కు ఆయన లేఖ రాశారు. మరో పక్క బీజేపీ నేతలు డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వినతి పత్రంలో కోరారు.