KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురై యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు నేడు పుష్పగుచ్చం, లేఖ పంపారు. కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. స్వల్ప అస్వస్థతతో కెసిఆర్ నిన్న ఆసుపత్రి కి వెళ్లారని తెలిసి ఆందోళన చెందారని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్విట్ చేశారు.
KCR: వారం రోజులు విశ్రాంతి
సీఎం కెసిఆర్ నిన్న స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగా వచ్చాయి. దీనితో ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఇటీవల కెసిఆర్ వరుస పర్యటన లు చేయటం వల్ల అలసి పోయారన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ఆహ్వానించలేదు. దీనిపై గవర్నర్ తమిళి సై నోచ్చుకున్నారు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరోక్షంగా కామెంట్ చేశారు. మహిళలు ఇంకా వివక్షతకు గురవుతున్నారని, ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను గౌరవించే పరిస్థితి కనిపించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశం నిర్వహించడం పై టిఆర్ఎస్ సర్కార్ ను బిజెపి, కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. ఈ పరిణామాలతో పాటు గతంలో జరిగిన విషయాలతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై మధ్య గ్యాప్ బాగా పెరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో గవర్నర్ కెసిఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?