రవాణా వాహన యజమానులకు భారీ ఊరట కల్పిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ.50 లు చొప్పున అపరాధ రుసుము వసూలు చేసే వారు. దీంతో ఈ అపరాధ రుసుము చెల్లించే పరిస్థితి లేక చాలా మంది వాహనదారులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవడం లేదు. ఇలా తెలంగాణలో దాదాపు మూడు లక్షలకు పైగా వాహనాల యజమానులు మూడు నాలుగు సంవత్సరాల నుండి ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ వాహనదారులకు ఉపశమనం కల్గించేలా కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ.50లు చొప్పున వసూలు చేసే అపరాధ రుసుము విధింపు నుండి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో వాహనానికి రూ.30వేల నుండి 70వేల వరకూ పెనల్టీ చెల్లించాల్సిన పని ఉండదు. లక్షలాది వాహనాలు ఫిట్ నెస్ సర్టిపికెట్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల లక్షకు పైగా పెనాల్టీలు ఉన్నాయి.
కోవిడ్ సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నందున 2020 ఫిబ్రవరి నుండి ఆక్టోబర్ 2021 వరకూ పెనాల్టీ నుండి మినహాియంపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రోజుకు రూ.50ల అపరాధ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.