Telangana Govt: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై అనేక విమర్శలు రావడంతో పాటు కొందరు ఉద్యోగులు బదిలీలను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బదిలీల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను కొత్త జోన్ల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు చేశారు. ఇందలో 101 మంది తప్ప మిగిలిన 38,542 మంది ఉద్యోగులు తమ కొత్త స్థానాల్లో చేరారు. ఇప్పుడు ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.
Telangana Govt: నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీ
ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం కోసం నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిస్థితులను అధ్యయనం చేసి ఈ కమిటీ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
సీనియర్ ఐఏఎస్ శేషాద్రి అధ్యక్షతన కమిటీ
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో సీ ఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జీ హెచ్ఎం సీ కమిషనర్ లోకేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఉంటారు. ముఖ్య మంత్రి కేసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
Read More: AP News: ఈ సెటైర్ వింటే నవ్వు ఆపుకోలేరు..! కరోనా ఏపీలోకి రాదట..!!