Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయ వర్గాలకు బిగ్ షాక్ ఇచ్చేలా పాఠశాలల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వులతో ఉపాధ్యాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేసుకోవాలన్నా, విక్రయించాలన్నా అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 8న వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నల్లగొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు జావీద్, అతని సోదరుడు మధ్య భూ వివాదం నెలకొంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుగుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకూ ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో దాని ఆధారంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాాచారం.
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆదేశాలు గతంలోనూ ఉన్నప్పటికీ తాజాగా ప్రతి ఏటా సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఎవరో ఒకరిద్దరు ఉపాధ్యాయులు చేసిన తప్పులకు అందరిని అనుమానిస్తూ ఈ విధంగా ఆదేశాలు చేయడం కరెక్ట్ కాదని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.