Telangana Govt: ప్రతి ఏటా వేసవిలో విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒంటి పూట బడులకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోంది. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పాఠశాల విద్యార్ధుల సంక్షేమం కోసం ఒంటి పూట బడులకు నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read More: KCR: ఊహించని వ్యక్తి నుండి కెసిఆర్ కు ట్వీట్..!!
Telangana Govt: 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు
ఈ నెల 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
కాగా తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మే 20వ తేదీన ముగియనున్నాయి. అదే రోజు పాఠశాలలకు చివరి పనిదినం కానుంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది.
.