YS Sharmila: తనకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పాదయాత్రకు వెళ్లకుండా బ్యారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం.. షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దని, ఆమె ఇంటి వద్ద ఉన్న బ్యారికేడ్లు వెంటనే తొలగించాలని పోలీసులను ఆదేశించింది.
అయితే ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ షర్మిల అనుమతి లేకుండా ప్రగతి భవన్, రాజ్ భవన్ కు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బయటకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. తన పాదయాత్రకు అనుమతులు ఇవ్వడం లేదంటూ వైఎస్ షర్మిల ఇటీవలే రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించారు. వరంగల్లు సీపీ ఆమె పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.
కేసిఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ .. తెలంగాణపై సుప్రీం కోర్టుకెక్కిన ఏపీ