TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత సంతోష్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ నోటీసులపై బీఎల్ సంతోష్ కు గతంలో మంజూరు చేసిన స్టే ను ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో పలు మార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హజరు కాలేదని, అరెస్టునకు అనుమతించాలని ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టును కోరారు. నోటీసులపై స్టే ఉన్నందున అరెస్టునకు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. అదే విధంగా కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామి దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరిపిన హైకోర్టు.. స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీ వరకూ వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకూ ఆరెస్టు చేయడానికి వీలులేదని పేర్కొంది. అయితే సిట్ ఎదుట హజరై విచారణకు సహకరించాల్సి ఉంటుందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు బేరసారాలు జరుపుతూ వీరు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం వేగంగా కేసును దర్యాప్తు జరుపుతోంది.
TRS MLC Kavitha: సీబీఐ విచారణకు సహకరిస్తా.. కానీ