కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలియజేసింది. అయితే మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ పక్క ఆందోళనలు చేస్తూనే మరో పక్క న్యాయపరంగా పోరాటానికి సిద్దమైయ్యారు రైతులు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన రీక్రియేషన్ మ్యాప్ ను రైతుల తరపు న్యాయవాది సృజన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, కౌంటర్ దాఖలునకు ప్రభుత్వం తరపున అడ్వొకేటే జనరల్ సమయం కావాలని కోరారు. దీంతో బుధవారం వరకూ హైకోర్టు సమయం ఇచ్చింది. అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?