TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణకు గైర్హజరు అయిన బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, డాక్టర్ జగ్గుస్వామి లపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీట్.. సంతోష్ విచారణకు సహకరించడం లేదంటూ హైకోర్టుకు తెలిపింది. దీనిపై విచారణను బుధవారంకు వాయిదా వేసింది న్యాయస్థానం. ఇంతకు ముందు బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులో విచారణకు హజరుకాకపోతే అరెస్టు చేస్తామని పేర్కొంది. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా, సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. విచారణకు సంతోష్ సహకరించాలని ఆదేశిస్తూ అరెస్టు నుండి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. తదుపతి ఉత్తర్వులు ఇచ్చే వరకూ అరెస్టు చేయవద్దని సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. దీంతో సంతోష్ విచారణకు హజరు కాని విషయాన్ని సీట్ హైకోర్టుకు తెలిపింది. మరో పక్క సిట్ దర్యాప్తును ఆపాలంటూ నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని పిటిషన్ వేశారు.
అలాగే మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా, నిందితుల తరపున న్యాయవాదులు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను ఏ సీ బీ కోర్టు బుధవారంకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సిట్ అధికారుల నోటీసులతో అడ్వకేట్ శ్రీనివాస్ సిట్ అధికారుల ముందు నిన్న, ఈ రోజు విచారణకు హజరైయ్యారు. సింహయాజీ, నందకుమార్ లతో ఉన్న సంబంధాలపై శ్రీనివాస్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?