Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా ఉన్నాయి. మరో వైపు మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరుపుతోంది. నిన్న విచారణ సందర్భంలో ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశించగా.. నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ జాబితాను హైకోర్టుకు సమర్పించారు. మునుగోడులో 2018 అక్టోబర్ 12న ఓటర్లు 2,14,847 ఉన్నారనీ, ఈ నెల 11 నాటికి కొత్తగా వచ్చిన ఓట్లు మొత్తం కలిపి ఇప్పటి వరకు 2,38,759 ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.
కొత్తగా 25,013 ఓటర్లు ధరఖాస్తు చేసుకున్నారని వివరించిన సీఇఓ .. వీటిలో 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి, 7,247 తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 5,517 ఫారం 6 లు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తి అవుతుందని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఓటర్ల ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్ లో ఉన్న ఓటరు జాబితా నిలిపివేయాలని ఆదేశించింది.మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. వాటిపై సందేహాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
మరో పక్క మునుగోడు ఉప ఎన్నిక నిలుపుదలకు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
Munugode bypoll: మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం .. ఎంత మంది నామినేషన్లు దాఖలు చేశారంటే..?