TS High Court: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో తమకేమీ సంబంధం లేదనీ ఈ కేసు చార్జిషీటు నుండి తమను తొలగించాలని కోరుతూ ఇండియా సిమెంట్స్, గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ వీడీ రాజగోపాల్ వేరువేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఇండియా సిమెంట్స్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆ సంస్థ పేరును చార్జిషీటు నుండి తొలగిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఇండియా సిమెంట్స్ కు బిగ్ రిలీఫ్ కల్గింది. మరో పక్క గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ వీడీ రాజగోపాల్ కు ఈ కేసుతో సంబంధం ఉందని అభిప్రాయపడిన హైకోర్టు .. ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది.
CM YS Jagan: అందుకే ఆ హామీ నెరవేర్చలేకపోయా.. పోలీసు కుటుంబాలకు సంజాయిషీ ఇచ్చుకున్న సీఎం జగన్