Telangana High Court: ఆంధ్రప్రదేశ్ నుండి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్లను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిన్న తెలంగాణ పోలీసులు నిలుపుదల చేసి వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఒ పక్క కేంద్ర ప్రభుత్వం మొన్ననే కరోనా బాధితులు వారి ఇష్టం మేరకు ఏ రాష్ట్రంలోనైనా వైద్యం పొందే అవకాశం ఉందంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రానికి సుప్రీం కోర్టుకు తెలిపిన 24 గంటలు గడవక ముందు పొరుగు రాష్ట్రం నుండి వస్తున్న అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు నిలుపుదల చేసి వెనక్కు పంపడంపై తీవ్ర ఆక్షేపణలకు కారణమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో సోమవారం రాత్రికి తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్ ల విషయంలో నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.
కాగా ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వ చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విపత్తు వేళ అంబులెన్స్ లను నిలుపుదల చేసి వెనక్కు పంపడం మానవత్వమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏ అధికారంతో అంబులెన్స్ లు ఆపారని ప్రశ్నించింది. రాత్రి కర్ప్యూ సరిగా అమలు జరగడం లేదని పేర్కొంది. రంజాన్ తర్వాతనే కరోనా కట్టడికి తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించింది. మతపరమైన ప్రదేశాల్లో జనసమీకరణ ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం చెప్పే విషయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని పేర్కొంది. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశిస్తుంటే మరింత తగ్గిస్తారా అని ప్రశ్నించింది. నిబంధనల ఉల్లంఘనపై మీడియా కళ్లకు కట్టినట్ల చూపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ కోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేయడం బాధాకరమని పేర్కొంది. అధికారులు కోర్టు దిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు కోర్టుకు వివరించాలని ఆదేశించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?