EAMCET and ECET: తెలంగాణలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్, అదే విధంగా పీజీలో ప్రవేశం కొరకు నిర్వహించే ఈసెట్ షెడ్యుల్ ఖరారు అయ్యింది. ఈ మేరకు ఎంసెట్, ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఖరారు చేయగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూలై రెండో వారం నుండి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఎంసెట్ పరీక్షలు జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో జరగనున్నాయి. 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. 23 రీజినల్ సెంటర్లలో 105 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. జలై 13న ఈ సెట్ నిర్వహించనున్నారు.
ఎంసెట్, ఈసెట్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సారి ఎంసెట్ పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ర్యాంకులు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదన్న విషయం తెలిసిందే.