Inter Exams: ఏప్రిల్ 20వ తేదీ నుండి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 2వ తేదీ వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఏప్రిల్ 21 నుండి మే 5వ తేదీ వరకూ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. కరోనా కారణంగా ఇంటర్ పస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశారు. గత ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించగా చాలా మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ ఏడాది పరీక్షలకు కీలక నిర్ణయం తీసుకుంది.
Read More: Jagananna Thodu: జగనన్న తోడు కార్యక్రమం వాయిదా..మళ్లీ ఎప్పుడంటే..
Inter Exams: ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ను రెట్టింపు
ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ను రెట్టింపు చేసింది. గతంలో మూడు సెక్షన్ లో రెండు సెక్షన్లకు 50 శాతం ఛాయిస్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు మూడు సెక్షన్లలో కూడా ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇంటర్ బోర్డు 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీషు, ఉర్ధూ మీడియంలకు చెందిన మోడల్ ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్ సైట్ లో పెట్టారు.