Telangana Lock Down: తెలంగాణలో లాక్ డౌన్ ను ఈ నెల 30 వతేదీ వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. తొలుత పది రోజులు లాక్ డౌన్ విధించగా 22వ తేదీ నుండి నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇప్పటి వరకూ అమలు అవుతున్న లాక్ డౌన్ నిబంధనలే కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 6గంటల నుండి పది గంటల వరకూ అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ అమలు చేసిన తరువాత తెలంగాణలో కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 20వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా వేసినట్లు సమాచాారం.