Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అయితే లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం.. సడలింపు సమయాన్ని మరో మూడు గంటలు పెంచుతున్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ వరకే సడలింపు ఇస్తుండగా, దాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడిగించారు. అయితే సడలింపు సమయం తర్వాత బయటికి వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరుకునేందు గానూ మరో గంట పాటు అదనపు సమయం ఇచ్చింది. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కఠిన లాక్ డౌన్ అమలు అవుతుంది. అత్యవసర సేవలు సహా ప్రభుత్వం గతంలో తెలియజేసిన కార్యకలాపాలకు లాక్ డౌన్ నుండి యథావిధిగా మినహాయింపులు కొనసాగున్నాయి.
Read more: Lovers Suicide: కృష్ణాజిల్లాలో విషాదం ..ప్రేమికుల ఆత్మహత్య
లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో లాక్ డౌన్ అమలు తరువాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం లాక్ డౌన్ పొడిగించాలని సూచించినట్లు సమాచారం.