NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రియాక్షన్ ఇది

Share

తెలంగాణ సర్కార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని వచ్చినట్లు లేదనీ, తెలంగాణపై విషం గక్కడానికే వచ్చారని హరీష్ రావు అన్నారు. మోడీ మాట్లాడిన ప్రతి మాట సత్యదూరమని పేర్కొన్నారు. ప్రధానిగా ఇన్ని అబద్దాలు ఆడటం ఆయనకే చెల్లిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఆసరా పెన్షన్ లు, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయన్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.

Telangana minister Harish Rao Counter comments om PM modi speech

 

ప్రధాని మోడీ తన వల్లనే డీబీటీ మొదలైనట్లు అనడం పచ్చి అబద్దమని, ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించింది కేంద్ర ప్రభుత్వం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బంధుతో పోలిస్తే పీఎం కిసాన్ సాయమెంత అని అన్నారు. రైతు బంధు కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని అన్నారు. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవమని తెలిపారు. ఐటీఐఆర్ ను బెంగళూరుకు తరలించారని పేర్కొన్నారు.

మోడీ నోట.. జగన్ మాట

 


Share

Related posts

వ్యభిచారం చేశారని… ఆరుగురికి బహిరంగ మరణ శిక్ష అమలు..!!

sekhar

ఆ జిల్లాలో ఆ ఇద్దరి వైసిపి నేతల మధ్య కోల్డ్ వార్..!!

sekhar

అల పార్లమెంటులో… వయా మండలి…!

Srinivas Manem