వ్యవసాయం వ్యయసాయంగా మారుతోంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ గిట్టుబాటు కాక చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఈ తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటన హాస్యస్పదంగా మారింది. ప్రధాన మంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతులు ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమైతే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు ఉంచాలని ప్రధాని ని కేటిఆర్ డిమాండ్ చేశారు.
మోడీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగాభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని కేటిఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందో వివరాలను బహిర్గతం చేయాలని మంత్రి కేటిఆర్ కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన రైతులకు లాభాల పంట పండి ఆదాయం డబుల్ అయ్యిందో చెప్పాలన్నారు. ఇదిలా ఉంటే రైతుల ఆదాయానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్ లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై రాజకీయ పక్షాల మండిపాటు