Telangana MLC election Counting: తెలంగాణలో ఈ నెల 10వ తేదీ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉండటంతో పోటీ అనివార్యమైంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బలం టీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.
8గంటల నుండి ఓట్ల లెక్కింపు
జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి పూర్తి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 1324 మంది ఓటర్లకు గానూ 1320 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్ జరిగింది. 1026 మందికి గానూ 1018 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 97.01 శాతం 1271 మందికి 1233 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 768 మందికి 738 మంది (96.09 శాతం), ఉమ్మడి ఆదిలాబాద్ లో 937 మందికి 860 మంది (91.78 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Telangana MLC election Counting: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్
కరీంనగర్ జిల్లాలో రెెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 10 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. టిఆర్ఎస్ నుండి ఎల్ రమణ, భానుప్రసాద్ రావు, టీఆర్ఎస్ రెబల్ రవీందర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ నుండి తాత మధుసూధన్, కాంగ్రెస్ పార్టీ నుండి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుండి దండే విఠల్, స్వతంత్ర అభ్యర్ధిగా పుష్పరాణి, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ నుండి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి తూర్పు నిర్మల, స్వతంత్ర అభ్యర్ధిగా మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ నుండి కోటి రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధులుగా నగేశ్, లక్ష్మయ్య, కే వెంకటేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం,, బెజ్జం సైదులు, కొర్ల రామ్ సింగ్ బరిలో ఉన్నారు. కౌంటింగ్ కు ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ లో 6 టేబుల్స్, కరీంనగర్ లో 9 టేబుల్స్ మిగిలిన చోట్ల 5 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ హాలులో ఏర్పాటు చేశామని చెప్పారు. 25 ఓట్ల చొప్పున కౌంటింగ్ అధికారులు బండిల్స్ చేస్తారనీ, ఫస్ట్ ప్రెయారిటీ ఓట్లను కౌంట్ చేసిన తరువాత నెక్స్ట్ ప్రెయారిటీ ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?