తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( వీఆర్ఏ)లు గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారి సమస్యల పరిష్కారం కోసం విఆర్ఏ నేతల బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ తో చర్చలు జరిపారు. ఇంతకు ముందు మంత్రి కేటిఆర్ నూచన ప్రాయంగా అంగీకారం తెలిపిన డిమాండ్ ల పరిష్కారానికి సీఎస్ ఆమోదం తెలపడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుండి విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 80 రోజులకుపైగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు నిరాహార దీక్షలు చెేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే కొందరు వీఆర్ఏలు మృతి చెందినా వీఆర్ఏలు వెనక్కు తగ్గలేదు. రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మంత్రి కేటిఆర్ వారితో చర్చలు జరిపారు. ఆ రోజు విఆర్ఏలు తెలిపిన సమస్యలపై మంత్రి కేటిఆర్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినా అధికారికంగా ప్రకటించిన తర్వాతే సమ్మె విరమిస్తామని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వారి డిమాండ్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఏపి సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసించిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్.. ఎందుకంటే..?