Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో జంపింగ్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా సదరు ఎమ్మెల్యేలు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే లు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ పై విరుచుకుపడ్డారు. మీడియా ను ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి రోజూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పార్లమెంటు సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా హుందాగా ఉండాల్సింది పోయి బజారు భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ పిల్లి శాపాలకు బెదిరేవారు తెలంగాణ లో లేరన్నారు.
Read More: Revanth Reddy: కేసీఆర్ నీటి ఎత్తుగడకు అప్పుడే కౌంటర్ రెడీ చేసిన రేవంత్
ఆ ప్రశ్నకు జవాబు ఏది రేవంత్?
2017 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో ఎందుకు చేరావంటే చెప్పడం లేదని ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. ..మల్కాజ్గిరి ఎంపీగా కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోని రేవంత్ ఇక కాంగ్రెస్ ను ఏం ఉద్ధరిస్తాడు ? అంటూ కామెంట్ చేశారు. ఏడు తారీఖు ఎంతో దూరం లో లేదు ..ఏం చేస్తాడో మేమూ చూస్తాం అని అన్నారు. కాంగ్రెస్ ను హింసా మార్గం వైపు తీసుకెళ్లి తెలంగాణ లో శాంతి భద్రత ల సమస్య తేవాలని రేవంత్ ప్రయత్నం అని ఆరోపణలు చేశారు. గుండాయిజం ద్వారా రాజకీయాలు చేయడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు.
Read more: KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
కేసీఆర్కు వ్యతిరేకంగా కుట్రలు..
తెలంగాణ బాగు పడొద్దనే ఎజెండా ను రేవంత్ అమలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే లు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఎందరెందరో కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్న ఎమ్మెల్యేలు రేవంత్ అందులో ఒకరు అని తెలిపారు. కెసిఆర్ ను ఎదుర్కోవడం అంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడమేనన్నారు.
…తెలంగాణ వ్యతిరేకులు రేవంత్ అనే బ్రోకర్ ను ప్రోత్సహిస్తున్నారు అని విరుచుకుపడ్డారు. తెలంగాణ వ్యతిరేకుల చేతిలో కీలు బొమ్మ రేవంత్ అని ఆరోపించారు. ప్రజల హృదయాల్లో ఉన్న కెసిఆర్ ను కబళించడం బ్రోకర్ల వల్ల కాదు అని చెప్పుకొచ్చారు.