జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
అయితే , జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. జనసేన తరఫున గెలిచినప్పటి నుంచి అప్పుడప్పుడు తప్ప.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలను కూడా ఆయన పెడచెవిన పెడుతూ వచ్చారు. అదే ఒరవడిలో తాజాగా మరోసారి సంచలన రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు..
రాపాక సంచలనం…
ఏపీ సీఎం జగన్ పై జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ సర్కార్ తెచ్చిన పథకాలు, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఇదే ఒరవడిలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . నేను వైసీపీ కార్యకర్తను అంటూ ఈ జనసేన ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. సీఎం వైఎస్ జగన్ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే.. మీకు అభ్యంతరం ఏంటి? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాపాక.
పవన్ కళ్యాణ్ బ్యాడ్ లక్ కాకపోతే….
జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఇలా విరుచుకుపడుతుంటే …. తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే జనసేన పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు రాపాక వ్యవహారాన్ని లైట్గా తీసుకున్న అధిష్టానం.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో మరి!