గత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ విమర్శలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే… తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ trs bjp నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆరోపణలు, విమర్శలు.. ఒక్కటేంటి… పొద్దున లేస్తే.. ఆ రెండు పార్టీల నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
ఈ మధ్య జరిగిన దుబ్బాక్ బై పోల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు పీక్ స్టేజ్కి వెళ్లాయి. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నేతలు వచ్చికూడా టీఆర్ఎస్ ను trs, సీఎం కేసీఆర్ cm kcr ను, మంత్రి కేటీఆర్ను minister ktr టార్గెట్ చేశారు. ఈ కామెంట్ల పరంపరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ bjp state president bandi sanjay పేరును ప్రముఖంగా పేర్కొనవచ్చు. సీఎం కేసీఆర్పై నిప్పులు చెరగడంలో ఆయన ముందుంటున్నారు. కొన్ని సార్లు ఆయన కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. అయితే, ఆయన కంటే మరో బీజేపీ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఆమె బీజేపీ నాయకురాలు విజయశాంతి vijayashanthi.
విజయశాంతి సంచలనం
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పట్ల రాబందులా మారరంటూ విజయశాంతి vijayashanthi సంచలన వ్యాఖ్యలు చేశారు . “తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు… రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా… సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో… తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే… ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.” అంటూ విజయశాంతి vijayashanti ఫైర్ అయ్యారు.
ఇప్పటికే కేసీఆర్ పై కలకలం
ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాతో prime minister narendra modi , home minister amit sha తెలంగాణ సీఎం కేసీఆర్ telangana cm kcr సుదీర్ఘ చర్చలు జరపడంపై అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి vijayashanthi అలియాస్ రాములమ్మ.. మోడీ, కేసీఆర్ modi kcr భేటీపై స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్, trs సీఎం కేసీఆర్పై cm kcr పోరాటాలు చేస్తున్నారు.. కేసీఆర్ kcr మాత్రం ఢిల్లీలో అమిత్షాను amit sha కలుస్తున్నారు. ప్రధాని మోడీని modi కలుస్తున్నారు ఆయన బీజేపీ హైకమాండ్తో కూడా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా? ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం తీసుకున్నా… లోపల మాత్రం.. మేం తప్పులు చేసినా వదిలేయండి.. సీబీఐ, ఈడీ దాడులు జరగకుండా చూడండి అని చెప్పుకోవడానికే వెళ్లి ఉంటారని వ్యాఖ్యానించారు . ఇలా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ telangana bjp chief bandi sanjay కంటే విజయశాంతి vijayashanthi మరింత ఎక్కువగా విరుచుకుపడుతున్నారని పలువురు అంటున్నారు.